ఎన్నికల సందర్భంగా తనపైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను అనుమతించిన న్యాయస్థానం విచారణ జరిపింది. దర్యాప్తు అధికారులు తనను టార్గెట్ చేస్తున్నారని పిన్నెల్లి పేర్కొన్నారు. ఎమ్మెల్యే వినతిపై శుక్రవారానికల్లా నిర్ణయం వెలువరించాలని ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.