నేడు రెండో విడత ఎన్నికల పోలింగ్లో భాగంగా నటుడు ప్రకాష్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగళూరులోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. అనంతరం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తాను మార్పునకు ఓటు వేశానని, అలాగే ప్రజలకు కూడా తమ ఓటుతో మార్పు తీసుకురావాలని అభ్యర్థించారు.