గల్లంతైన ఓటు కోసం ఎన్నికల విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి నిరాహార దీక్ష చేపట్టిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. KSRTCకి చెందిన అసిస్టెంట్ స్టోర్కీపర్గా పనిచేసే మల్లికార్జున్ స్వామి బెంగళూరులోని పోలింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు వెళ్లాడు. కానీ ఆయన పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో షాక్కు గురయ్యాడు. దీంతో పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసనకు దిగాడు.