18వ లోక్సభ కొలువుదీరిన విషయం తెలిసిందే. లోక్ సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్ నుంచి ముర్ము పార్లమెంట్కు రానున్నారు. మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ ప్రాధమ్యాలను ఆమె వివరించనున్నారు. ప్రసంగం అనంతరం ఉభయ సభల్లో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యులు చర్చించనున్నారు.