కర్ణాటకలో యువకుడిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని, నల్లగాజులు వేసుకునేవాడని సీఐడీ అధికారులు గుర్తించారు. బాధితుడి వివరాల ప్రకారం.. 2019లో సూరజ్ పరిచయం తనకు అయ్యాడని, సూరజ్ రోజు గుడ్మార్నింగ్ మెసేజ్లతో పాటు లవ్ సింబల్స్ పంపించేవాడన్నారు. తనను ఫాంహౌస్కు పిలిచి కాళ్లు ఒత్తమని కోరాడని, ఆ తర్వాత బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితుడు వివరించాడు.