ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 15న సాయంత్రం హైదరాబాద్ రానున్న ఆయన.. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు 1.3కి.మీ మేర రోడ్షోలో పాల్గొననున్నారు. మల్కాజ్గిరి నుంచి బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతుండగా.. ఆయనకు మద్దతుగా మోదీ ప్రచారం చేయనున్నారు.