ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు

76చూసినవారు
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు.. అడ్డాకుల సమీపంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్