రేపు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం రహస్య గది

1063చూసినవారు
రేపు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం రహస్య గది
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. రహస్య గదిలో స్వామివారికి అపార సంపదలు, వజ్రవైఢూర్యాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల రహస్య గది రేపు తెరుచుకోనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్