కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం శనివారం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ లోక్సభా పక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని CWC సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీల సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవిలో సోనియా గాంధీ కొనసాగే అవకాశం ఉంది.