కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఘన విజయం సాధించారు. కేరళలోని వయనాడ్లో వరుసగా రెండోసారి గెలుపొందారు. తన సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5లక్షలపైగా మెజార్టీ సాధించారు. అటు ఉత్తరప్రదేశ్లోని తమ కంచుకోట రాయ్బరేలీలో 3.7లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.