ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని చెన్నారు. ఈ విషయాన్ని జగన్ తెలుసుకోలేకపోయారన్నారు. జగన్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వల్లే వైసీపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. బీజేపీతో ఉన్నామో లేదో జగన్ గట్టిగా చెప్పలేకపోయారన్నారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తే సరిపోదని.. అభివృద్ధి కూడా కావాలని అన్నారు. అందువల్లే వైసీపీకి 11 స్థానాలు వచ్చాయన్నారు.