రంజీ ట్రోఫీ-2024 తొలి మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. రాహుల్ సింగ్ గహ్లోత్ 157 బంతుల్లో(214, 23 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి(123 బంతుల్లో డబుల్ సెంచరీ) తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా రాహుల్ నిలిచాడు.