కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే వయనాడ్ సీటును రాహుల్ గాంధీ ఖాళీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాయ్బరేలీ ఎంపీ హోదాను అలాగే ఉంచుకోవాలని, ఎందుకంటే యూపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంటుందని యూపీ కాంగ్రెస్ కమిటీ పేర్కొంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.