పాక్లోని రావల్పిండిలో ఇవాళ జరగాల్సిన పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. మధ్యాహ్నం 2గంటలకు టాస్ వేయాల్సి ఉండగా.. వాన కారణంగా ఇప్పటివరకు టాస్ వేయలేదు. గ్రూప్-Bలో వర్షం కారణంగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు అయ్యిన విషయం తెలిసిందే. గ్రూప్-Aలో భారత్, కివీస్ సెమీస్కు వెళ్లిన నేపథ్యంలో నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ప్రేక్షకులు కూడా స్టేడియానికి పెద్దగా రాలేదు.