AP: విశాఖ కేజీహెచ్లో శిశువుల మార్పిడి కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి కేజీహెచ్లో శిశువుల మార్పిడి జరిగినట్లు సమాచారం. ఒకరి శిశువును ఆస్పత్రి సిబ్బంది మరొకరికి అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాంతో కేజీహెచ్ గైనిక్ వార్డు వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు. ఏడుగురు అధికారులతో విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.