ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ గెలుపు

559చూసినవారు
ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ గెలుపు
ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. జోస్ బట్లర్ 60 బంతుల్లో 107* పరుగులతో చెలరేగి విజయాన్ని అందించాడు. రియాన్ పరాగ్(34), పోవెల్ (26) ఆదుకున్నారు. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలో రెండు వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్