వినాయక నిమజ్జనంలో ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు మృతి

81చూసినవారు
వినాయక నిమజ్జనంలో ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు మృతి
మహారాష్ట్రలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. ధూలే జిల్లాలోని చిత్తోడ్ గ్రామంలో ఊరేగింపు ప్రారంభానికి ముందు ట్రాక్టర్ డ్రైవర్ ఎక్కడికో వెళ్లగా.. మరో వ్యక్తి స్టార్ట్ చేశాడు. అది రివర్స్‌లోకి వెళ్లి ప్రజలపైకి దూసుకెళ్లడంతో 13, 6, 3 ఏళ్ల చిన్నారులు చనిపోయారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వ్యక్తి, అసలు డ్రైవర్ పారిపోగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్