ఇంగ్లాండ్తో జరగుతున్న మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. కష్టకాలంలో జట్టును నిలబెట్టడానికి రోహిత్.. కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ లో 157 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ 101( 2 సిక్స్ లు,11 ఫోర్లు) పరుగులు చేశాడు. మరో ప్లేయర్ రవీంద్ర జడేజా 68 పరుగులతో కొనసాగుతున్నాడు.