కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ యూపీలోని రాయబరేలి లోక్సభ నియోజకవర్గ ఓటర్లకు బహిరంగ లేఖ రాశారు. ‘బరువెక్కిన మనస్సుతో ఈ లేఖ రాస్తున్నాను. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ మీరు నా కుటుంబానికి, నాకు అండగా ఉంటారని అనుకుంటున్నా. ఆరోగ్యం, వయస్సును దృష్టిలో ఉంచుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు’ అని పేర్కొన్నారు. ఈసారి సోనియా స్థానంలో ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారు.