కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో బెంగళూరులో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. బెంగళూరులో నేటి నుంచి ఈ మద్య నిషేధం అమల్లోకి రానుంది. ఈ నెల 17 వరకు నిషేధం కొనసాగనుంది. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఖాళీ అయిన స్థానానికి శుక్రవారం ఉప ఎన్నిక నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు మద్యం విక్రయాలను నిషేధించాలని అధికారులు నిర్ణయించారు.