బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో షిమోగా జిల్లా తీర్థహళ్లికి చెందిన బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్ను NIA అదుపులోకి తీసుకుంది. తీర్థహళ్లిలోని ఓ మొబైల్ షాపుకు చెందిన ఇద్దరు యువకులను పేలుడుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న అధికారులు ఇటీవల విచారించారు. సాయిప్రసాద్తో పరిచయం ఉన్నట్లు తెలియడంతో అతడిని ప్రశ్నిస్తున్నారు.