సెంట్రల్ కాశ్మీర్లోని గందర్బాల్లో బుధవారం ఓ చిరుతపులి బీభత్సం సృష్టించింది. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని అది గాయపరిచింది. ఇక ఓ వన్యప్రాణి సంరక్షణ అధికారి ఆ చిరుతపులిని బంధించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయనపై ఆ చిరుతపులి దాడి చేసింది. అయితే ఆ అధికారి ధైర్యంగా పోరాడారు. స్థానికులు, ఇతర అటవీశాఖ అధికారులు ఎంతో శ్రమించి ఆ చిరుతపులిని బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.