వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. 2004కు ముందు కూడా ఎన్డీయే అధికారంలో ఉందని, కానీ కాంగ్రెస్ హస్తగతం చేసుకుందని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత కూటమి తరపున ప్రధాని ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే వారికి.. వారిని రక్షించే శక్తుల మధ్య యుద్ధం నడుస్తోంది.