సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఓటర్ల మనసు గెలిచేందుకు కొత్త విధానం ఎంచుకున్నారు. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో ఎవరు పిలిచినా కాదనకుండా వివాహలకు హాజరు అవుతున్నారు. పెళ్లికి హాజరై అక్కడికి వచ్చిన వారిని పేరు పేరునా పలకరిస్తున్నారు. తాజాగా బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ది చిన్నరాజు బేబీ నాయన ఏకంగా బుధవారం ఒక్కరోజే 31 వివాహాలకు హజరయ్యారు.