కొండకల్ పాఠశాలలో బదిలీ అయిన ఉపాధ్యాయులకు సన్మానం

71చూసినవారు
కొండకల్ పాఠశాలలో బదిలీ అయిన ఉపాధ్యాయులకు సన్మానం
కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ మధ్య జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో కొండకల్ పాఠశాల నుండి రామకృష్ణారావు, రాములు, వెంకటేశం, సుజాత, అరుంధతి, ఐదు మంది ఉపాధ్యాయులు ఇతర పాఠశాలకు బదిలీపై వెళ్లడం జరిగింది. అదేవిధంగా గత నెల 30వ తేదీన యాదమ్మ (సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు) పదవీ విరమణ పొందడం జరిగింది. వారందరికీ సోమవారం కొండకల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు డి. జీవనజ్యోతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్