ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు
మహేశ్వరం నియోజకవర్గం కడ్తాల్ మండల పరిధిలోని మక్తమాధారంలో మంగళవారం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారి సౌమ్య తెలిపారు. ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.