రైతులు ఎంత ధాన్యం పండించినా రూ. 500 బోనస్ ఇచ్చి మరీ కొంటాం’.. ఇదీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. గ్యారెంటీల జాబితాలోనూ దాన్ని చేర్చింది. అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ తాజాగా ప్రకటించి.. మెజార్టీ రైతులకు మొండిచెయ్యి చూపించింది. అది కూడా రానున్న వానకాలం సీజన్ నుంచి మాత్రమేనని సోమవారం కేబినెట్ మీటింగ్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.