మల్కాజ్ గిరిలో మౌలిక వసతుల కల్పనకు కృషి

70చూసినవారు
మల్కాజ్ గిరిలో మౌలిక వసతుల కల్పనకు కృషి
మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని శక్తి గణేష్ కాలనీవాసులు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆదివారం కలిశారు. గత దశాబ్ద కాలం నుంచి సరైన రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. శక్తి గణేష్ కాలనీలో మౌలిక వసతులు కల్పించడానికి బల్దియా కమిషనర్కు ప్రతిపాదనలు అందజేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్