రంగారెడ్డి జిల్లా మణికొండలో కారు పార్కింగ్ వద్ద స్కూటీ పై వచ్చిన ఓ మహిళపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కుక్కలు దాడి చేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. అర గంట పాటు వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేసినా పైపైకి వచ్చి వీధి కుక్కలు దాడి చేసినవి. పట్టించుకోని అధికారులు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల బారి నుండి కాపాడాలంటూ అధికారులకు కాలనీ వాసులు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.