అక్రమ నిర్మాణాల కూల్చివేత

563చూసినవారు
రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ లో దేవాదాయ శాఖ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలపై ఆశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు మద్య కూల్చివేతలు చేపట్టారు. కోట్లాది రూపాయల విలువ చేసే తుల్జారాంబాగ్ దేవాలయ భూమిని ఓరియల్టర్ కబ్జాచేసి పహారీ గోడలు నిర్మించి అమ్మకానికి పెట్టాడు. ఈ నేపథ్యంలో స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన దేవాదాయ శాఖాధికారులు వాటిని నేలమట్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్