శంషాబాద్ మండలంలో ఓ కుమారుడు గొడ్డలితో తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఊటుపల్లిలోని ఇంద్రానగర్కు చెందిన రాములు (55), పోచమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు శివకుమార్ సంతానం. కొంత కాలంగా అతడు ఇంటికి రాకుండా అదే ప్రాంతంలోని అత్తగారింట్లో ఉంటున్నాడు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన కుమారుడు కసాయిగా మారాడు. ఇంటికి రాకుండా అత్తగారింట్లో ఉంటున్నాడని తండ్రి మందలించాడు. శనివారం కుమారుడు గొడ్డలితో తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు.