ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో భాగంగా సీఎం రేవంత్కు సమన్లు జారీ అయ్యాయి. అయితే ఈ నోటీసులపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు నోటీసులు ఇస్తున్నారు అని రేవంత్రెడ్డి తెలిపారు.