ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

71చూసినవారు
ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
పెద్దేముల్‌ మండలం కందనెల్లి తండాకు చెందిన రామీబాయి(49) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పి భరించలేక ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన గ్రామస్థులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. ‌కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్