పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్పై ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం స్పందించారు. పేటీఎంపై చర్యలను తాము సమీక్షించాలనుకోవడం లేదని ఆయన తేల్చిచెప్పారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై విధించిన ఆంక్షలను సమీక్షించే అవకాశం దాదాపు లేనట్లే అని దాస్ వెల్లడించారు.