రికార్డు స్థాయిలో ఎండలు.. వడదెబ్బతో ఏడుగురు మృతి

28406చూసినవారు
రికార్డు స్థాయిలో ఎండలు.. వడదెబ్బతో ఏడుగురు మృతి
తెలంగాణలో భానుడి ప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంతగా రికార్డు స్థాయిలో ఎండలు మండుతున్నాయి. పది జిల్లాల్లోని 20 మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 46.6 డిగ్రీలు నమోదైంది. ఈ జిల్లాలోని పలు మండలాలు 46.5 నుంచి 46.2 డిగ్రీల ఎండతో అల్లాడాయి. ఇక వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా మరో ఏడుగురు మృతి చెందారు.

సంబంధిత పోస్ట్