తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ మంగళ, బుధవారాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం
ఉందని ఐఎండీ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి, భూపాలపల్లి, నాగ
ర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కాగా, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలిస్తున్నారు.