‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు పంజాబ్-హర్యానా హైకోర్టులో ఊరట లభించింది. ఓ హత్య కేసులో అతడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇప్పటికే సీబీఐ కోర్టు ఒక రేప్, జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసుల్లో బాబాను నిందితుడిగా తీర్పును ఇచ్చింది. దీనిని డేరాబాబా హైకోర్టులో సవాలు చేశారు. వీటిల్లో తాజాగా రంజిత్ సింగ్ హత్యకేసులో నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు వచ్చింది.