కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు, వాయిదాలు అంటూ నడుస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. శనివారం పెద్దపల్లి లోక్సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. త్వరలోనే కేసీఆర్ పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకొస్తారని, ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని చెప్పారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయన్నారు. ఏడాదిలోపు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని జోస్యం చెప్పారు.