సీఎం జగన్కు ప్రచార పిచ్చి పెరిగిపోయిందని
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ అన్నారు. 'ఇంకా ఏమైనా మిగిలాయేమో వెతుక్కో జగన్. మరుగుదొడ్ల వద్ద కూడా జగనన్న ఆరోగ్య సురక్ష మూత్రశాల ఏంటో? చెప్పుకోవడానికి చేసిందేమీ లేక ఇలా బోర్డులు పెట్టుకుంటున్నారు. ఏమీ పట్టనట్లు చివరకు ఇలా ఫ్లెక్సీలు కట్టుకుంటూ పోతున్నారు.
ఉద్యోగాలు లేక రోజుకో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.' అని అన్నారు.