ప్రతిపక్ష నేతలపై పంజా విసిరే ఆర్కే రోజా ముచ్చటగా మూడోసారి తన సిట్టింగ్ స్థానం నగరి నుంచి బరిలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తక్కువ ఓట్లతో బయటపడ్డ ఆమె.. ఈ సారి కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాశ్తో పోటీ పడుతున్నారు. అయితే 2019లో విజయం సాధించిన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా రోజా పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు.