మహిళలకు నెలకు రూ.3వేలు: ఏఐఏడీఎంకే
By Gopichand 68చూసినవారురానున్న లోక్సభ ఎన్నికలకు ఏఐఏడీఎంకే మేనిఫెస్టోను తమిళనాడు మాజీ సీఎం కే. పళనిస్వామి విడుదల చేశారు. రాష్ట్రాల గవర్నర్ల నియామకంలో సీఎంలను సంప్రదించాలని కేంద్రాన్ని కోరతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నీట్ పరీక్ష రద్దు చేస్తామని, ప్రతి కుటుంబంలో మహిళకు నెలకు రూ. 3000 నగదు అందచేస్తామని, చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తదితర హామీలను మేనిఫెస్టోలో పొందు పరిచారు.