ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం Vivo చైనా మార్కెట్లోకి Vivo వై200ఐ పేరుతో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ను బడ్జెట్లో అదిరే ఫీచర్స్తో తీసుకొచ్చారు. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. 8GB RAM + 256GB వేరియంట్ ధర మన కరెన్సీలో రూ.18,800గా ఉంది. అలాగే 12GB RAM+256GB వేరియంట్ ధర రూ. 21,200కాగా, 12GB RAM+512GB వేరియంట్ ధర రూ. 23,500గా ఉండనుంది. ఇందులో 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సౌకర్యం కలదు.