భారత స్టార్ రెజ్లర్లు సాక్షిమాలిక్, గీతా ఫొగాట్, అమన్ సహ్రావత్ సరికొత్త ప్రకటన చేశారు. త్వరలో తాము రెజ్లింగ్ ఛాంపియన్స్ సూపర్ లీగ్ను ఆవిష్కరిస్తామని తెలిపారు. వర్ధమాన క్రీడాకారుల కోసం దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ‘‘సాక్షి, నేను చాలా కాలంగా ఈ లీగ్ని ప్లాన్ చేస్తున్నాము. ప్రభుత్వం, జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ మాకు మద్దతు ఇస్తే చాలా బాగుంటుంది. ఇది ఆటగాళ్ల ప్రయోజనం కోసం చేస్తున్నాం’’ అని ఫొగాట్ వెల్లడించింది.