నేరడిగుంట హనుమాన్ మందిరంలో పంచాంగ పఠనం

72చూసినవారు
నేరడిగుంట హనుమాన్ మందిరంలో పంచాంగ పఠనం
ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలోని హనుమాన్ మందిరంలో అశోక్ స్వామి పంచాంగ పఠనం మంగళవారం చదివి వినిపించారు. వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలనే ఎంపీటీసీ లవ్వ కృష్ణగౌడ్ మాజీ సర్పంచ్ చందులత వీరమళ్లప్పలు కోరారు. ఈ కార్యక్రమంలో గున్నాల నాగప్ప, బి. శివరాజ్, పత్తి వీరేశం, సోషల్ వర్కర్ శ్రీదర్ రెడ్డి, మక్త బాపురెడ్డి, పట్లోళ్ల శంకర్, బోయిని శంకర్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్