పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి ఇరగదీశాడు. ఈ యువ బ్యాటర్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. దీంతో సన్రైజర్స్ 20 ఓవర్లలో 182/9 పరుగులు చేసింది. సమద్ 25, హెడ్ 21, అభిషేక్ 16, షాబాజ్ 14* పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ 4, హర్షల్ 2, సామ్ కరన్ 2, రబాడ ఒక వికెట్ తీసుకున్నారు. పంజాబ్ లక్ష్యం 183.