ఏపీలో మాటల యుద్ధం.. వాలంటీర్లే టార్గెట్

85842చూసినవారు
ఏపీలో మాటల యుద్ధం.. వాలంటీర్లే టార్గెట్
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ రచ్చ రాజుకుంటుంది. వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ, కూటమి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు హోరెత్తుతున్నాయి. చంద్రబాబు వల్లే పెన్షన్లు ఆలస్యమయ్యాయని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే వాలంటీర్ల వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదని.. అధికారంలోకి రాగానే రూ.10వేలు పారితోషికం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు సీఎంగా తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపైనే చేస్తానని జగన్ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్