సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు మంగళవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో మెరిశారు. మొత్తం 98 మంది పరీక్షలు రాయగ ఇందులో 43 మంది బాలురు 55 మంది బాలికలు ఉన్నారు. ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. పదికి పది జీపీఏ సాధించిన మానస, షర్మిల అనే విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.