గణనాథులను దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు

55చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో "సింఫోనీ హోమ్స్ " కమ్యూనిటీలో శనివారం రాత్రి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొజ్జ గణపయ్యకు ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గణనాధుని దయ అందరిపై ఉండాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్