కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు ఒకటేనని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు అలవి గాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.