సంగారెడ్డి పట్టణం తాళ్లపల్లి రోడ్ లోని దుర్గమ్మ దేవాలయ జాతర ఈనెల 24వ తేదీ నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోపాజి అనంతకృష్ణ తెలిపారు. సంగారెడ్డి లోని దుర్గమ్మ ఆలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జాతర కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.